జాతీయ స్థాయి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు వచ్చానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
తుక్కుగూడ సభలో మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొన్ని నెలల క్రితం తుక్కుగూడలో గ్యారంటీ కార్డు విడుదల చేశాను. హామీలు ఇచ్చిన విధంగా రూ.500కు సిలిండర్, గృహజ్యోతి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గ్యారంటీలు అమలు చేశాం. అమలు చేయదగిన గ్యారంటీలనే ఇచ్చాం' అని వ్యాఖ్యానించారు.