రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు. రైతులు సాంకేతికత అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామని, రైతులకు మేలు చేసేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.