ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న SIB మాజీ DSP ప్రణీత్రావు సంచలన విషయాలు వెల్లడించారు. నేతలు, జడ్జిలు, స్థిరాస్తి వ్యాపారులపై సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు చెప్పారు. .ప్రధానంగా ప్రతిపక్షనేతలకు వెళ్లే డబ్బును అడ్డగించి పట్టుకున్నట్లు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్యాపింగ్ ఆపేయాలని ప్రభాకర్రావు నుంచి ఆదేశాలు అందినట్లు చెప్పారు. ఆధారాలను నాగోల్, మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో పడేసినట్లు తెలిపారు.