కిషన్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వస్తాం: బండి సంజయ్

1534చూసినవారు
కిషన్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వస్తాం: బండి సంజయ్
కిషన్ రెడ్డి నాయకత్వంలో కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. యువతకు ఉపాధి, రూ. 6,109 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం ప్రధాని మోదీ వచ్చారని, కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని ఈ సభకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ప్రపంచమే మోదీని బాస్ గా గుర్తించిందని, వరంగల్ అభివృద్ధి కోసమే మోదీ వచ్చారని తెలిపారు.

సంబంధిత పోస్ట్