భక్తి, విశ్వాసాలను తాము ప్రచారం చేయబోం: డీకే శివకుమార్

525చూసినవారు
భక్తి, విశ్వాసాలను తాము ప్రచారం చేయబోం: డీకే శివకుమార్
అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ట వేడుక సందర్భంగా ఈ నెల 22న సెలవు ప్రకటించరాదని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమర్థించుకున్నారు. తమ మతం, భక్తి, విశ్వాసాలను తాము ప్రచారం చేసుకోబోమని తెలిపారు. ఇప్పటికే ఆలయాల్లో మంత్రులు పూజలు చేస్తున్నారని, తమ పూజలు ఫలిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. అందరూ ప్రార్థనలు చేయాలని తాము కోరుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్