అయోధ్యలో నిర్మించిన భవ్య మందిరంలో మరికొన్ని గంటల్లో శ్రీరాముడు కొలువుదీరనున్నారు. ఈ క్రమంలో అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన న్యూజిలాండ్ మంత్రి డేవిడ్ సేమౌర్ మీడియాతో మాట్లాడారు. "జై శ్రీరామ్ 500 ఏళ్ళ తర్వాత ఈ నిర్మాణాన్ని సాధ్యం చేసినందుకు ప్రధాని మోదీతో సహా భారతదేశంలోని ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని అన్నారు. మోడీ ఎప్పుడూ క్షేమంగా ఉండాలన్నారు. రామ మందిరాన్ని సందర్శించడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు.