పీఓకే భారత్లో అంతర్భాగం అని, దానిని స్వాధీనం చేసుకుని తీరతామని హోంమంత్రి అమిత్ షా అన్నారు. కౌశాంబిలో బీజేపీ అభ్యర్థి వినోద్ సోంకర్కు మద్దతుగా ఆదివారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పాకిస్థాన్ అణుబాంబుకు రాహుల్ గాంధీ భయపడతారని, తాము భయపడబోమని అన్నారు. I.N.D.I.A కూటమి గెలిచే అవకాశం లేదని, ఒకవేళ వారు గెలిస్తే ఏడాదికి ఒక ప్రధాని వస్తారని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించిందన్నారు.