తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8, లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచిన భాజపా.. 2028 శాసనసభ ఎన్నికల్లో 88 స్థానాలను కైవసం చేసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరింత కష్టపడి పనిచేయాలని తమను ప్రజలు ఆదేశించినట్లు ఫలితాలు చెబుతున్నాయని, వారి ఆదేశం ప్రకారం పూర్తిస్థాయిలో పనిచేసి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు.