భారత్ క్రికెట్లో ధోనీ-రైనా ఫ్రెండ్షిప్కు ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా ఐపీఎల్లో రాజస్థాన్ జట్టుపై విజయం సాధించిన అనంతరం ధోనీ ‘ల్యాప్ ఆఫ్ హానర్’ నిర్వహించాడు. జట్టు సభ్యులతో కలిసి తాను సంతకాలు చేసిన బంతులను టెన్నిస్ రాకెట్తో కొట్టి అభిమానుల వద్దకు పంపించాడు. అదే సమయంలో రైనా కనిపించాడు. తన చేతిలోని టెన్నిస్ రాకెట్ను అతడికి ఇచ్చి అభిమానులకు బంతులను పంచాలని కోరాడు. రైనా అభిమానుల వైపు కొట్టి. రాకెట్ను మహీకు అప్పగించాడు.