బిల్లు చెల్లింపుల్లో సమర్థత, భద్రతకు పెద్దపీట వేసేందుకు RBI కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లు చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) ద్వారానే జరగాలని నిర్దేశించింది. జులై 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీనిలో భాగంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ను హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ యాక్టివేట్ చేసుకోలేదు. దీంతో ఫోన్ పే, క్రెడ్ వంటి కంపెనీలు కస్టమర్ల క్రెడిట్ కార్డుల బిల్లులను ప్రాసెస్ చేయలేవు. విద్యుత్ బిల్లుల చెల్లింపుల విషయంలోనూ అదే జరిగింది.