2023లో అనుమతులు మంజూరు చేస్తే 2025లో ఎలా రద్దు చేస్తారు? ఇన్నేళ్లు ఏం చేశారని న్యాయమూర్తి నిలదీశారు. పార్కు స్థలాన్ని కబ్జా చేశారని గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ హైడ్రా రాక ముందు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. హక్కులను నిర్ణయించాల్సింది సివిల్ కోర్టు అన్న విషయం తెలియదా అంటూ ప్రశ్నించింది. పిటిషనర్ను కబ్జాదార్లుగా ఎలా పేర్కొంటారని హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ను హైకోర్టు నిలదీసింది.