తమ పార్టీకి చెందిన 9 మంది రాజ్యసభ ఎంపీలతో ఇవాళ బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ సమావేశం నిర్వహించారు. జూన్ 27 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల సమయంలో.. బలమైన, చురుకైన ప్రతిపక్షంగా రాజ్యసభలో వ్యవహరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి చెందిన సమస్యలపై కూడా సభలో కేంద్ర సర్కారును నిలదీయాలన్నారు. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ను లేవనెత్తాలని చెప్పారు.