పుట్టిన రెండు రోజులకే.. కవల కూతుళ్లను చంపిన తండ్రి

63చూసినవారు
పుట్టిన రెండు రోజులకే.. కవల కూతుళ్లను చంపిన తండ్రి
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించాడు.. పుట్టిన రెండు రోజులకే కవల కూతుళ్లను చంపాడు. నీరజ్ సోలంకి, పూజ ఇద్దరు దంపతులు. ఈ ఏడాది మే 30న కవల పిల్లలకు పూజ జన్మనిచ్చింది. జూన్‌ 1న ఆసుపత్రి నుంచి కవల పిల్లలతో కారులో వెళ్ళిన నీరజ్‌ కూతుళ్లను హత్య చేశాడు. ఢిల్లీ శివారులోని పూత్ కలాన్‌లో పాతిపెట్టి పరారయ్యాడు. అయితే కవలలిద్దరూ ఆడ బిడ్డలు కావడంతోనే ఈ హత్య చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్