బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి తాము మద్దతు ఇచ్చేది లేదని ఒడిశాలోని ప్రతిపక్ష పార్టీ బీజేడీ పేర్కొంది. తమ పార్టీకి చెందిన 9 మంది రాజ్యసభ ఎంపీలతో మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ సోమవారం సమావేశమయ్యారు. ఒడిశాకు ప్రత్యేక హోదా డిమాండ్ను లేవనెత్తాలని సూచించనట్లు ఆ పార్టీ నేత సస్మిత్ పాత్ర వెల్లడించారు. ఒడిశా ప్రయోజనాలను విస్మరిస్తే ఆందోళనకు దిగాలని నిర్ణయించినట్లు చెప్పారు.