వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉంది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ భామ కోలీవుడ్ హీరో ధనుష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లతో కలిసి నటిస్తోంది. వీటితోపాటు బాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న సికిందర్లో హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ మూవీ షూటింగ్ కోసం ముంబైలో ల్యాండ్ అయింది రష్మిక. తాజాగా సికిందర్ మూవీ తొలి రోజు షూట్ లొకేషన్లో దిగిన రష్మిక ఫొటో నెట్టింట వైరలవుతోంది.