బుద్ధ పూర్ణిమ రోజు గవ్వలను కోలుగోలు చేసే ఆచారం కూడా ఉంది. గవ్వలంటేనే లక్ష్మీదేవికి ప్రతీక, తద్వారా సంపాదన నిలిచి ఉంటుంది. నేడు వెండి నాణెం కూడా కొనుగోలు చేసేవారు ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు గౌతమ బుద్ధుని ప్రతిమను కొనుగోలు చేస్తారు. బుద్ధుని ప్రతిమ ప్రశాంతతని కలిగిస్తుంది. ఇత్తడి ఏనుగును కొనుగోలు చేస్తే కూడా ఇంట్లో, జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారని చాలామంది నమ్ముతారు.