హైదరాబాద్, సికింద్రాబాద్ ఓటర్లంతా ఎక్కడున్నారు?

68చూసినవారు
హైదరాబాద్, సికింద్రాబాద్ ఓటర్లంతా ఎక్కడున్నారు?
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పల్లెల్లో ఓటింగ్ శాతం పెరగగా.. గ్రేటర్ లో ఓటు వేయడానికి ఎవరూ రావట్లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరిలోని పోలింగ్ బూత్ లలో ఓటర్లు కనిపించట్లేదు. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రంలో 52.34 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ మూడు చోట్ల 35 శాతానికే పరిమితమైంది. ఎంత అవగాహన కల్పించినప్పటికీ ఓటేయడానికి రావడం లేదు. దీంతో గ్రేటర్ లో పోలింగ్ శాతం తక్కువ నమోదైంది.

సంబంధిత పోస్ట్