గత దశాబ్ద కాలంలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరగలేదు. రాష్ట్రంలో ఐ.టి రంగం, ఫార్మా రంగం, టెక్స్టైల్స్, వ్యవసాయాధారిత పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకోలేదు. విశాఖపట్నంతో పాటు తిరుపతి, అనంతపురం, ప్రకాశం జిల్లాలో దొనకొండ, గన్నవరం తదితర ప్రాంతాలను పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. నిరుద్యోగులకు ప్రభుత్వ శాఖలలో ఖాళీగా వున్న ఉద్యోగాలతో పాటు, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయటం ద్వారా ఉపాధి కల్పించాలి. పెద్ద సంఖ్యలో ఉన్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులరైజేషన్తో ఉద్యోగ భద్రత కల్పించాలి.