జీఎస్‌టీఏటీ తొలి అధ్యక్షుడిగా ఎవరు పదవీ బాధ్యతలు చేపట్టారు?

57చూసినవారు
జీఎస్‌టీఏటీ తొలి అధ్యక్షుడిగా ఎవరు పదవీ బాధ్యతలు చేపట్టారు?
జీఎస్‌టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ తొలి అధ్యక్షుడిగా 2024, మే 6న జస్టిస్(రిటైర్డ్) సంజయ్ కుమార్ మిశ్రా పదవీ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో ఈయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కమిటీ ఈయనను ఎంపిక చేసింది. జీఎస్‌టీ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలయ్యే అప్పీళ్లను విచారించేందుకు జీఎస్‌టీఏటీ ఏర్పాటైంది.

సంబంధిత పోస్ట్