ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ చరిత్రలో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ జిమ్నాస్ట్గా దీపా కర్మాకర్ వార్తల్లో నిలిచారు. 2024, మేలో తాష్కెంట్లో జరిగిన మహిళల వాల్ట్ ఈవెంట్లో ఈమె 13.566 పాయింట్లతో విజేతగా నిలిచింది. గతంలో ఈమె ఈ టోర్నీలో 2015లో కాంస్యం సాధించింది. డోపింగ్ నేరంపై 21 నెలల నిషేధం తర్వాత మళ్లీ బరిలోకి దిగిన ఈమె పారిస్ ఒలింపిక్స్కు మాత్రం అర్హత సాధించలేక పోయింది.