అమెరికాలోని కాలిఫోర్నియాలో శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. ఏపీలోని విజయవాడలో జన్మించిన జయ బాడిగ మచిలీపట్నం లోక్సభ మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కుమార్తె. కాలిఫోర్నియా స్టేట్ బార్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత 2009లో బడిగా న్యాయవాద వృత్తి ప్రారంభమైంది.