హిందూ మతంలో వైశాఖ మాసం పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ ఏడాది మే 23వ తేదీ వచ్చింది. వైశాఖ పూర్ణిమ రోజున రావి చెట్టును పూజించడం ద్వారా కోరికలు నెరవేరుతాయని, విష్ణువు అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు. దీంతో పూర్వీకులు కూడా సంతృప్తి చెందుతారని విశ్వాసం. అలాగే ఈరోజున చెట్లను నాటడం వలన బృహస్పతి గ్రహం చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారు.