ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో దారుణం జరిగింది. ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడుతోందని ప్రదీప్ సింగ్ అనే వ్యక్తి తన భార్య ఫోన్ను లాక్కున్నాడు. దీంతో ఆమె ప్రదీప్కు మత్తుమందు ఇచ్చి, మంచానికి కట్టేసి కరెంట్ షాక్ ఇచ్చింది. దానిని అడ్డుకోబోయిన కొడుకు పైనా దాడికి పాల్పడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రదీప్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.