ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బుధవారం పోలీస్ అభ్యర్థులకు నియామకపత్రాలు అందించే కార్యక్రమంలో మాట్లాడుతూ.. కేసీఆర్ ఎలా అధికారంలోకి వస్తారో తాను చూస్తానని అన్నారు. అసెంబ్లీకి రాని వారికి అధికారం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీతో కొట్లాడుదామంటే కేసీఆర్ ఇంటి నుంచి బయటకు రావడం లేదని ఎద్దేవా చేశారు.