పోలీసుల డ్రోన్లు Vs రైతుల గాలిపటాలు (వీడియో)

64352చూసినవారు
'ఢిల్లీ ఛలో' కార్యక్రమంలో పాల్గొంటున్న రైతులను అడ్డుకునేందుకు, చెదరగొట్టేందుకు పోలీసులు డ్రోన్లతో టియర్ గ్యాస్ షెల్స్ వేస్తున్నారు. పంజాబ్-హర్యానా శంభు సరిహద్దు వద్ద బుధవారం ఈ దృశ్యం కనిపించింది. అయితే డ్రోన్లను అడ్డుకునేందుకు రైతులు తెలివిగా గాలిపటాలను ఎగుర వేస్తున్నారు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. రైతులను ముందుకు కదలనీయకుండా హర్యానాలోని అన్ని సరిహద్దుల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

సంబంధిత పోస్ట్