హిందువులు తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అలాగే, విష్ణువు, శ్రీకృష్ణుడికి సమర్పించే నైవేద్యంలో తప్పనిసరిగా తులసి ఆకులను ఉపయోగిస్తారు. అయితే తులసి చెట్టు నుంచి ఆకులు తెంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. తులసి ఆకులను స్నానం చేసి, తులసిమాతను ప్రార్థించిన తర్వాతనే తెంచాలి. ఒకసారి గరిష్టంగా కేవలం 21 ఆకులను మాత్రమే తెంచాలి. లేదంటే లక్ష్మీ దేవికి కోపం వస్తుందని హిందువుల విశ్వాసం.