కేసీఆర్ మాటల్లో కొంచెమైనా వాస్తవాలు లేవని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతగా దిగజారుతారా అనిపించిందని మండిపడ్డారు. కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని కేసీఆర్ ప్రయత్నించారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులంతా భారీగా కాంగ్రెస్లో చేరుతున్నారని తెలిపారు. మైక్ సమస్య వస్తే.. కరెంట్ కోతలు అంటూ అబద్ధం మాట్లాడారని, కేసీఆర్ తాను కట్టిన ఇల్లును తగలబెట్టి పోయారని ఫైర్ అయ్యారు.