ఆతిథ్య వెస్టిండీస్ను చిత్తు చేసి దక్షిణాఫ్రికా అగ్రస్థానంతో సెమీస్కు దూసుకెళ్లింది. విండీస్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఇబ్బంది పడింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను 17 ఓవర్లకు కుదించి టార్గెట్ను 124 పరుగులుగా నిర్దేశించారు. చివరికి 16.1 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి సఫారీల జట్టు విజయం సాధించింది. చివరి ఓవర్లో ఐదు పరుగులు అవసరమైన సమయంలో రబాడ ఫోరుతో మ్యాచ్ను ముగించాడు.