ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో షాకింగ్ ఘటన జరిగింది. అధికారుల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని సమావేశంలో మందలించారు. ఓ ఫైలును కూడా అధికారిపైకి విసిరారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే రెండు నెలల క్రితం నగరంలో డ్రైనేజీ క్లీనింగ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆమె స్వయంగా పరిశీలించారు. ఇంజినీర్లు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.