మధ్యప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ప్రభుత్వ జేహెచ్పీజీ కళాశాలలో కొందరు దుండగులు.. ప్రొఫెసర్ నీరజ్ ధాకడ్ కళ్లల్లో కారం చల్లి కర్రలతో చితకబాదారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. నిందితుల్ని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.