మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రెండు ట్రాలీ బ్యాగుల్లో రెండు ముక్కలుగా ఉన్న గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. డాక్టర్ అంబేద్కర్ నగర్-ఇండోర్ ప్యాసింజర్ రైలులో శనివారం రాత్రి పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తున్న సమయంలో రెండు అనుమానాస్పద ట్రాలీ బ్యాగులను గుర్తించారు. రైల్వే పోలీసులు వచ్చి ఆ బ్యాగులను తెరిచి చూడగా, రెండు ముక్కులుగా ఉన్న మృతదేహం కనిపించింది. అయితే ఆమె రెండు చేతులు, కాళ్లు మాత్రం కనిపించలేదు.