వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల ఆహారంలో పురుగు

559చూసినవారు
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల ఆహారంలో పురుగు
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌‌లో ఆదివారం ఓ ప్రయాణికుడికి అందించిన ఆహారంలో పురుగు కనిపించింది. అభయ్ సింగ్ సెంగార్ అనే వ్యక్తి భోపాల్‌లోని రాణి కమలాపతి స్టేషన్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్‌ వెళ్లేందుకు వందేభారత్ ట్రైన్ ఎక్కాడు. ట్రైన్‌లో ఆయనకు అందించిన అల్పాహారంలో పురుగు కనిపించింది. దీనిపై రైల్వే అధికారులను ఆయన నిలదీశాడు. వందేభారత్‌లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్