చైనాకు చెందిన టెక్ దిగ్గజం షావోమీ విద్యుత్తు వాహనాల రంగంలోకి అడుగుపెట్టింది. తొలి కారు స్పీడ్ అల్ట్రా (ఎస్యూ)7 డెలివరీలను ఈనెల నుంచి మొదలుపెట్టనున్నట్లు మంగళవారం ప్రకటించింది. దీని ధరను మార్చి 28న ప్రకటిస్తారని సమాచారం. ఈ కారు విక్రయాల కోసం చైనాలోనే 29 చోట్ల 59 స్టోర్లను సిద్ధం చేసినట్లు సంస్థ పేర్కొంది. ప్రపంచంలో తొలి 5 అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటిగా నిలవాలన్నదే తమ లక్ష్యమని షావోమీ సీఈవో లీ జున్ తెలిపారు.