ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. ఈ మేరకు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరికొద్ది సేపట్లో జరిగే కేంద్ర కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.