విశ్వ హిందు పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని మంగళవారం శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్ ర్యాలీని ప్రారంభించారు. యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్, జై హనుమాన్ అనే నినాదాలతో ర్యాలీ కొనసాగించారు.