గుర్తుతెలియని మృతదేహం లభ్యం
భువనగిరిలో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని సంజీవ్ నగర్ సమీపాన 60 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానికుల సహాయంతో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు భిక్షాటన చేసే వ్యక్తిగా భావిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.