మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు (వీడియో)

57చూసినవారు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దొనకొండ మండలం గంగదొనకొండ గ్రామ శివారులో గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మహిళపై పెట్రోల్ పోసి దుండగులు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్