ఆ పాత్ర నేను పోషించాల్సింది.. అందుకే ఆ సినిమా ఇప్పటికీ చూడలేదు: అరవింద్‌ స్వామి

61చూసినవారు
ఆ పాత్ర నేను పోషించాల్సింది.. అందుకే ఆ సినిమా ఇప్పటికీ చూడలేదు: అరవింద్‌ స్వామి
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అరవింద్‌ స్వామి మాట్లాడుతూ "మానాడు చిత్రంలో ఎస్‌.జె.సూర్య పోషించిన పాత్రలో నేను నటించాల్సింది. కానీ, అప్పుడు నా డేట్స్‌ సర్దుబాటు కాలేదు. ఆ సినిమా మేకర్స్‌ను నెల సమయం కోరా. అయితే నాకోసం నెల వేచి చూడలేని పరిస్థితి వారిది. నాకోసం సృష్టించిన పాత్రల్లో మరొకరిని నేను ఊహించుకోలేను. అందుకే ‘మానాడు’ను ఇప్పటికీ చూడలేదు’’ అని అన్నారు. ‘సత్యం సుందరం’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు.

సంబంధిత పోస్ట్