ఆ తేదీలలో మద్యం షాపులు బంద్
ప్రశాంత వాతావరణంలో పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు గాను ఈనెల 13 న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 11 సాయంత్రం 5 నుండి 13 సాయంత్రం 6 గంటల వరకు లేదా పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు జిల్లాలో అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు బంద్ చేయబడతాయని బుధవారం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టరు హనుమంతు ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవన్నారు.