మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ.. టెర్రస్‌ పైనుంచి పడి యువతి మృతి

61చూసినవారు
మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ.. టెర్రస్‌ పైనుంచి పడి యువతి మృతి
మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటి టెర్రస్‌ పైనుంచి కింద పడి ఓ యువతి మృతి చెందింది. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ సంఘటన జరిగింది. గోపాల్‌నగర్‌ కు చెందిన మాన్సీ అబేద్వార్(18) అనే యువతి బుధవారం ఇంటి టెర్రస్‌పైకి వెళ్లి చిన్నగోడపై కూర్చొని మొబైల్‌ ఫోన్‌లో ఫ్రెండ్‌తో మాట్లాడింది. ఈ క్రమంలో అదుపుతప్పి ఆమె టెర్రస్‌ పై నుంచి కిందపడింది. రక్తం మడుగులో పడి ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్