యూపీలోని ముజఫర్నగర్లోని కాజిఖేడా టోల్ప్లాజా వద్ద మరోసారి గొడవ జరిగింది. టోల్ప్లాజాకు చెందిన సిబ్బంధికి కారు డ్రైవర్లకు మధ్య వివాదం తలెత్తింది. దీంతో టోల్ప్లాజా బౌన్సర్లు హర్యానాకు చెందిన కారు రైడర్లను తీవ్రంగా కొట్టారు. దీంతో స్థానికులు కల్పించుకొని గొడవ సద్దుమనిగేలా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ముజఫర్నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.