ఏపీ యవతను వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ‘ఏపీకి కనీసం 10 పరిశ్రమలు కూడా రాలేదు. ఉద్యోగాలు దొరక్క యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. యువత లేని రాష్ట్రంగా ఏపీ తయారవుతోంది. మెగా డీఎస్సీ అని దగా చేశారు. జాబ్ క్యాలెండర్ అని జగన్.. యువతను మోసం చేశారు’ అంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదా పేరు చెప్పి ఓట్లు దండుకున్నారే తప్ప.. ఎవరూ పోరాటం చేయలేదని వ్యాఖ్యానించారు.