ఏపీకి చంద్రబాబు సీఎం అవ్వాలని ఓ వ్యక్తి నాలుక కోసుకున్నాడు. HYD శ్రీనగర్ కాలనీలోని వేంకటేశ్వర ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. "నా పేరు చెవల మహేశ్. మాది ప.గో జిల్లా గూటల గ్రామం. వైఎస్ఆర్, జగన్ సీఎం అవ్వాలని ఇక్కడే నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్నా. ఇప్పుడు చంద్రబాబు సీఎం కావాలని, పవన్, లోకేశ్ గెలవాలని నాలుక కోసుకున్నా." అని అతడి వద్ద లభించిన లేఖలో రాసి ఉంది.