ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈసీ నిర్ణయంతో ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు, పరీక్ష పరీక్షల కోసం ఎదురు చూడాల్సిందే.