తమిళనాడులో తీవ్ర విషాద ఘటన జరిగింది. వెల్లూరు జిల్లా కుడియాతం సమీపంలోని సరస్సులో పడి నలుగురు మహిళలు మృతి చెందారు. మృతులు లలిత, సరోజ, కావ్య, ప్రీతిగా గుర్తించారు. వేపూర్ గ్రామానికి చెందిన వీరు మునీశ్వరన్ ఆలయానికి వెళ్లి శమీ దర్శనం ముగించుకుని సమీపంలోని సరస్సులో స్నానాలు చేశారు. ఆ తర్వాత నలుగురు వ్యక్తులు అనూహ్యంగా నీటిలో మునిగి చనిపోయారు. నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.