అరుణాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగక ముందే 10 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగిసింది. నామినేషన్ల గడువు ముగిసిన అనంతరం రాష్ట్రంలోని మొత్తం 60 స్థానాలకుగాను 10 స్థానాల్లో కేవలం ఒక్కొక్క నామినేషన్ మాత్రమే ఉన్నాయి. ఆ పది మందిలో అందరూ బీజేపీ అభ్యర్థులే ఉన్నారు. వారంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.