వైసీపీ నిర్వహిస్తోన్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్కు నిరసన సెగ తగిలింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామస్తులు బస్సు యాత్రను అడ్డుకున్నారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ ఆందోళన నిర్వహించారు. గ్రామంలోని చెరువును నీటితో నింపలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.