ఏలూరు జిల్లా సత్రంపాడులో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఎంఆర్సీ కాలనీకి చెందిన జక్కుల రత్న గ్రేస్ (22) అనే యువతి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తోంది. ఏసురత్నం అనే యువకుడు ఆమెను వెంబడించి కత్తితో దాడి చేశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. యువతిని హతమార్చిన తర్వాత నిందితుడు కూడా కత్తితో మెడ కోసుకున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.