ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డిపై మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించే ఏజెంట్లు తమకు అవసరం లేదని, ఎన్నికల కౌంటింగ్కు వెళ్లొద్దంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఈ మేరకు తాడేపల్లి సీఐకు దేవినేని ఉమా ఫిర్యాదు చేశారు. టీడీపీ, జనసేన ఏజెంట్లను అడ్డుకోమని వైసీపీ ఏజెంట్లకు సజ్జల చెప్పడంపై ఆయన ఫిర్యాదు చేశారు. సజ్జలను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.