AP: విజయవాడ సమీపంలోని కానూరు వేదికగా జరుగుతోన్న రామోజీరావు సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. "రామోజీరావు అందించిన స్ఫూర్తి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆయన సమాజానికి ఎంతో సేవ చేశారు. ఏ రంగంలో అయినా.. రామోజీరావు నంబర్ వన్గా ఉన్నారు. వ్యక్తి కాదు.. వ్యవస్థ. ఎన్టీఆర్, రామోజీరావును ఎవరూ అధిగమించలేరు." అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.